చెన్నై : తమిళనాడులోని కడలూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఖాళీగా ఉన్న భవనంలో మహిళను ఆమె ప్రియుడి ఎదుటే లైంగిక వేధింపులకు గురిచేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడితో కలిసి ఖాళీగా ఉన్న భవనంలో మహిళ ఉండగా నిందితులు దారుణానికి ఒడిగట్టారు.
నిందితులను శబరి, సతీష్, అరిఫ్లుగా గుర్తించారు. మహిళపై కన్నేసిన నిందితుడు మరో ఇద్దరితో కలిసి ప్రియుడితో ఉన్న బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు వ్యక్తులు మహిళ ప్రియుడిని పట్టుకోగా అతడి ముందే నిందితుడు మహిళపై లైంగిక దాడికి తెగబడ్డాడు.
పోలీసు వాహనాల శబ్ధం రావడంతో నిందితులు ఘటనా స్ధలం నుంచి పారిపోయారు. భవనం వద్ద ఒంటరిగా ఉన్న మహిళను కాపాడిన పోలీసులు ఆపై నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.