లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా పశువులను మేత కోసం బయటకు తీసుకువెళ్లిన 14 ఏండ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కాన్పూర్ సమీప గ్రామంలో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలిపై చుట్కన్, బద్కన్ అనే సోదరులు ఈ దారుణానికి పాల్పడ్డారు.పశువుల మేత కోసం వెళ్లిన బాలిక ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు తీవ్రంగా గాలించారు. బాలిక పొదల్లో అపస్మారక స్ధితిలో పడి ఉందని బంధువులుక సమాచారం అందింది.
బాలిక స్ప్రహ కోల్పోవడంతో పాటు నిందితులు ఆమె చేతులు కట్టిపడేసి, నోట్లో గుడ్డలు కుక్కారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.