బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన పలువురు స్కూల్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో స్కూల్ కరస్పాండెంట్ సహా ప్రైవేట్ నర్సింగ్ ఇనిస్టిట్యూట్ టీచర్ను అరెస్ట్ చేశారు. ఈ నేరానికి సంబంధించి ఇవే ఆరోపణలపై ఓ ఉపాధ్యాయుడితో పాటు మహిళా టీచర్ను ఇటీవల అరెస్ట్ చేశారు.
ఇనిస్టిట్యూట్కు చెందిన 17 ఏండ్ల బాలిక గత వారం ఆత్మహత్యకు యత్నించడంతో విద్యా సంస్ధలో జరుగుతున్న దారుణాలు బయటపడ్డాయి. ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదవగా పట్టుబడిన మహిళా టీచర్పై నేరానికి సహకరించారనే అభియోగాలు నమోదయ్యాయి. ఇక విల్లుపురం జిల్లాలో జరిగిన మరో ఘటనలో బాలికపై 77 ఏండ్ల పొరుగింటి తాతతో పాటు ఎనిమిది మంది ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ ఉదంతంలో బాదిత బాలిక గర్భం దాల్చింది. ఈ నేరానికి పాల్పడిన నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి మరణించడంతో బాధితురాలు గింజీ ప్రాంతంలోని ఓ గ్రామంలో అత్త వద్ద ఉంటోందని, తండ్రి వేరుగా నివసిస్తున్నాడని విల్లుపురం ఎస్పీ ఎన్ శ్రీనాధ చెప్పారు.