లక్నో : యూపీలో దారుణ ఘటన వెలుగుచూసింది. సహజీవనం సాగిస్తున్న టీనేజ్ జంట బలవన్మరణానికి పాల్పడింది. సంత్ కబీర్ నగర్ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో చెట్టుకు వేలాడుతూ టీనేజర్లు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. మృతులను గోరఖ్పూర్ జిల్లాకు చెందిన అన్షు గౌడ్ (17), రాంపూర్ గ్రామానికి చెందిన ఆంచల్ (14)గా గుర్తించామని పోలీసులు మంగళవారం తెలిపారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఖలీలాబాద్ డీఎస్పీ అన్షుమన్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.