భోపాల్ : మధ్యప్రదేశ్లోని బెతుల్లో దారుణం వెలుగుచూసింది. ట్యూషన్కు వచ్చే బాలిక(15)పై కన్నేసిన టీచర్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు గర్భం దాల్చింది. నిందితుడి తల్లితండ్రులతో కుమ్మక్కై ఆమెకు బలవంతంగా ప్రైవేట్ ఆస్పత్రిలోని డాక్టర్ అబార్షన్ చేయడం కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోచింగ్ సెంటర్ను నిర్వహించే ప్రకాష్ భోజ్కర్ గత ఏడాది అక్టోబర్ 16న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితుడు బాధితురాలిని హెచ్చరించాడు.
బాలిక గర్భం దాల్చిందని తెలియడంతో నిందితుడి తల్లితండ్రులు పట్టణంలోని కరుణా ఆస్పత్రికి ఆమెను తీసుకువచ్చి మార్చి 22న అబార్షన్ చేయించారు. ఈ విషయం వెలుగుచూడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడితో పాటు అతడి తల్లితండ్రులు, అబార్షన్ చేసిన వైద్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.