న్యూఢిల్లీ : పార్క్లోపల చెట్టుకు మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించిన ఘటన దేశ రాజధాని సమీపంలోని నోయిడా సెక్టార్ 47లో కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోర్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. చెట్టుకు వేలాడుతూ మరణించిన యువకుడి వివరాలను పోలీసులు ఇంకా గుర్తించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ప్రాధమిక దర్యాప్తు అనంతరం వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.