బెంగళూర్ : దళిత యువకుడితో సన్నిహితంగా ఉంటున్నదనే కోపంతో కన్నకూతురి(17)ని హత్య చేసిన వ్యక్తి ఉదంతం కర్నాటకలోని మైసూరుకు సమీపంలోనని కగుండి గ్రామంలో వెలుగుచూసింది. వొక్కలిగ వర్గానికి చెందిన బాలిక పొరుగు గ్రామానికి చెందిన దళిత యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. వీరి సంబంధాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు యువకుడికి దూరంగా ఉండాలని కూతురిని హెచ్చరించారు.
తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా యువకుడితో సంబంధం కొనసాగించడం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో కూతురి గొంతు పిసికి హత్య చేసిన తండ్రి ఆపై మృతదేహాన్ని పొలంలో పడవేశాడు. ఈ ఘటనకు సంబంధించి బాలిక తల్లితండ్రులు ఇద్దరినీ అరెస్ట్ చేశామని మైసూర్ ఎస్పీ చేతన్ వెల్లడించారు. కులోన్మాద హత్య స్ధానికంగా కలకలం రేపింది. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నివేదిక రాగానే తదుపరి దర్యాప్తు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు.