జైపూర్ : రాజస్ధాన్లో దారుణం జరిగింది. జుంఝును పట్టనంలోని హవేలీలో నివసించే ఖట్మండు వాసి కరువ సర్కి తన మనవరాలి వయసున్న పొరుగింటి బాలిక(8)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు చాక్లెట్ ఆశ చూపి తన రూమ్కు పిలిపించి ఆపై దారుణానికి తెగబడ్డాడు.
కొడుకు, కోడలు వద్ద నిందితుడు నివసిస్తుండగా ఘటన జరిగిన సమయంలో వారు నేపాల్లో ఉన్నారు. ఆ సమయంలో అతడితో పాటు ఉన్న మనవళ్లు ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. పొరుగున ఉండే బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా చాక్లెట్ ఇస్తానని చెప్పి తన రూమ్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక ఆపై జరిగిన విషయంలో తల్లికి చెప్పగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.