భోపాల్ : మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. 11 ఏండ్ల బాలికను మామిడి తోటలోకి తీసుకువెళ్లిన ఆమె కజిన్ ఆపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం మధ్యప్రదేశ్లోని రెవాలో ఆదివారం వెలుగుచూసింది. ఇంటికి తిరిగివచ్చిన తర్వాత బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక స్టేట్మెంట్ను మహిళా అధికారి రికార్డు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.