కోల్కతా : కఠిన చట్టాలు తీసుకువచ్చినా బాలికలు, మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా నాలుగో తరగతి చదివే బాలికకు బిస్కెట్ల ఆశ చూపి ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్లిన నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
పశ్చిమ బెంగాల్లోని హబీబ్పూర్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. బిస్కెట్లు ఇస్తానంటూ ఫ్యాక్టరీలోకి బాలికను బలవంతంగా తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో బాధితురాలు అక్కడి నుంచి పారిపోయి బయటపడింది. నిందితుడిని నిమై బిశ్వాస్గా గుర్తించారు.
నిందితుడి చెర నుంచి తప్పించుకున్న బాలిక జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలపడంతో వారు హబీబ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.