మెహిదీపట్నం : అనుమానాస్పద స్థితిలో గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..లంగర్హౌస్ హరిదాస్ పురాలో నివసించే అంజలి (20) గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త తలుపు కొట్టగా ఆమె చాలా సేపటి వరకు తెరవలేదు. దీంతో ఆందోళన చెందిన భర్త స్థానికుల సహకారంతో తలుపులు విరగ్గొట్టి చూడగా ఉరివేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించి ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మరణించినట్లు ధృవీకరించారు. శుక్రవారం ఉస్మానియా మార్చురీలో అంజలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.