రంగారెడ్డి : అబ్దుల్లాపూర్మెట్ చౌరస్తాలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై ట్యాంకర్ అడ్డంగా బోల్తా పడటంతో.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గ్యాస్ ట్యాంకర్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గ్యాస్ లీక్ అవుతుందేమోనన్న భయంతో స్థానికులు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా పడ్డ ట్యాంకర్ను తొలగిచేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. దీంతో అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.