రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో నిషేధిత గుట్కా విక్రయిస్తున్నట్లు జిల్లా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో బీవై నగర్లో శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రూ. 22 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విక్రయిస్తున్న అచ్చం రాజు, గంగుల రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్కా, జర్దా ప్యాకెట్లు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ రెండింటిని అమ్ముతున్నారనే సమాచారం ఉంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.