న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) గురుగ్రాంకు చెందిన 23 ఏండ్ల మహిళపై రాజస్ధాన్లోని దౌసా జిల్లాలో నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తన ఫ్రెండ్ను కలిసేందుకు జైపూర్కు వచ్చిన బాధితురాలు రెండురోజులుగా ఆమెతో ఉన్నారు. ఈ క్రమంలో తన స్నేహితురాలి బాయ్ఫ్రెండ్తో కలిసి ఆమె దౌసా వెళ్లారు. దౌసాలో మరో ఇద్దరితో కలిసి నిందితుడు ఆమెకు మద్యం తాపించి ఒకరి తర్వాత మరొకరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
వీరితో పాటు మరొక వ్యక్తి కూడా ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని దౌసా ఎస్పీ అనిల్ బెనివల్ పేర్కొన్నారు.