చెన్నై : తమిళనాడులోని కోయంబత్తూర్లో ఈనెల 11న ఇంటి నుంచి అదృశ్యమైన బాలిక (14) విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. బాలిక కిడ్నాప్కు గురైన సమయంలో దినసరి కూలీగా పనిచేసే తల్లి కలైవాణి పనినిమిత్తం బయటకు వెళ్లింది. రెండు రోజుల పాటు గాలించిన తర్వాత 13న కుటుంబ సభ్యులు కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
శరవణంపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మృతదేహం కనిపించింది. బాలిక కాళ్లు, చేతులు కట్టిపడేసి ఉండటంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది నెలల కిందట భర్త వదిలివేయగా కలైవాణి ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటూ దినసరి కూలీగా పనిచేస్తోంది. పెద్ద కూతురు టెక్స్టైల్ స్టోర్లో పనిచేస్తుండగా రెండో కూతురు అయిన బాధితురాలు క్రితిక ప్రభుత్వ స్కూల్లో చదువుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.