పట్నా : లైంగిక వేధింపులను ప్రతిఘటించిన ఎనిమిదవ తరగతి చదివే బాలికపై కత్తిపోట్లతో విరుచుకుపడిన ఆకతాయి ఉదంతం బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో వెలుగుచూసింది. డిసెంబర్ 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇద్దరు స్నేహితులతో కలిసి బాలిక స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా మాటు వేసిన నిందితుడు కత్తితో బాలికపై దాడి చేశాడు. 13 సెకండ్లలో ఎనిమిది సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో నిందితుడిని ఓ వ్యక్తి లాగివేసేందుకు ప్రయత్నిస్తున్నా అతడు బాలికపై కత్తిపోట్లకు గురిచేయడం కనిపించింది.
బాలికను గోపాల్గంజ్లోని సదర్ ఆస్పత్రికి తరలించగా ఆపై మెరుగైన వైద్యం కోసం పట్నా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలోనూ బాలిక స్కూల్కు వెళుతూ, వచ్చే సమయాల్లో వేధిస్తుండేవాడని బాధితురాలి తల్లితండ్రులు తెలిపారు.