చండీఘఢ్ : పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఈనెల 16న ఓ వ్యక్తి తన సవతి కుమార్తె (15)పై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తండ్రి ఘాతుకం గురించి తల్లికి బాలిక వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాలిక తల్లికి మొదటి వివాహం ద్వారా నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. నిందితుడిపై లైంగిక దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని అతడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.