ఖైరతాబాద్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నేపాల్కు చెందిన ప్రేమ్ తిరువా, గీతా తిరువా దంపతులు కొంత కాలం క్రితం నగరానికి వచ్చారు. బంజారాహిల్స్ రోడ్నం.1లోని మహేశ్వరి టవర్స్ గ్రౌండ్ ఫ్లొర్లో నివాసం ఉంటున్నారు.
వారికి ఓ కుమార్తె (16) పదో తరగతి చదువుతున్నది. ఈ నెల 8న అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఉదయం చూసే సేరికి కనిపించకపోవడంతో చుట్టు పక్కల, తెలిసిన వారిని ఆరా తీసినా ఫలితం లేదు.
కనిపించకుండా పోయిన రాత్రి తమ ఇంటి పక్కనే నివసించే విశాల్ అనే యువకుడితో ఫొన్లో మాట్లాడినట్లు, తమ కుమార్తె మిస్సింగ్ వెనుక అతనే కారణమై ఉంటాడని తల్లి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.