జైపూర్ : రాజస్దాన్లోని అళ్వార్ జిల్లా నారాయణ్పూర్ ప్రాంతంలో దారుణం వెలుగుచూసింది. 15 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు మంగళవారం సామూహిక లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. బాధితురాలి కుటుంబసభ్యులు బుధవారం రాత్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం బయటపడింది.
బాలికపై ఈనెల 19న సామూహిక లైంగిక దాడి జరిగిందని, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితులు హెచ్చరించారని ఫిర్యాదులో వారు ఆరోపించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రదాన నిందితుడితో పాటు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని కేసు దర్యాప్తు చేపట్టిన బన్సూర్ డీఎస్పీ మృత్యుంజయ్ మిశ్రా పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తరలించామని దర్యాప్తును వేగవంతం చేశామని మిశ్రా వెల్లడించారు.