హైదరాబాద్ : హయత్నగర్లో భారీగా గంజాయి పట్టుబడింది. 1300 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న డీసీఎం వాహనంతో పాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 2.80 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాకు చెందిన నరేంద్ర హరిజన్(29), చంద్రేశ్ సాకేత్(32) కలిసి.. గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నరేంద్ర, సాకేత్ కలిసి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పెంటారావుతో అక్టోబర్ 2న 1300 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఆ గంజాయిని ఛత్తీస్గఢ్కు చెందిన రాజేశ్ డీసీఎంలో నింపారు.
అనంతరం ఆ వాహనాన్ని నరేంద్ర, సాకేత్కు పెంటారావు అప్పగించాడు. ఇక వీరిద్దరూ కలిసి గంజాయిని మధ్యప్రదేశ్కు తరలిస్తుండగా, పెద్ద అంబర్పేట్ వద్ద హయత్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.