మాదన్నపేట: ప్రియుడికి వివాహం నిశ్చయం కావడంతో కేసులో ఇరికేందుకు యువతి గ్యాంగ్ రేప్ నాటకమాడి పోలీసులను పరుగులు పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం ఓ యువతి తనను ముగ్గురు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని సంతోష్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదుతో వెంటనే రంగంలో కి దిగిన పోలీసులు విచారణలో భాగంలో సీసీ టీవీ ఫుటేజ్ లు పరిశీలించారు. కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు దొరకకపోవడంతో యువతిని విచారించగా తనను ప్రియుడు మోసం చేయడంతో ఆయనను ఇరికించేందుకు ఆత్యాచారం నాటకమాడినట్లు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.