కోల్కతా: ప్రేమించిన వ్యక్తికి అప్పటికే పెళ్లి అయినట్లు తెలుసుకున్న ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని లాబ్పూర్లో ఈ ఘటన జరిగింది. 2014 జనవరిలో సుబల్పూర్లో 20 ఏండ్ల గిరిజన మహిళపై అందరూ చూస్తుండగా సామూహిక లైంగిక దాడి జరిగింది. మరో వర్గానికి చెందిన వ్యక్తితో ఆమెకు సంబంధం ఉండటంపై గిరిజన పెద్దలు రూ.50,000 జరిమానా విధించారు. ఆ డబ్బును మహిళ చెల్లించకపోవడంతో గిరిజన పెద్దల నిర్ణయంతో ఆమెపై సామూహిక లైంగిక దాడి జరిగింది. కలకలం రేపిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా వారికి 20 ఏండ్ల జైలు శిక్ష పడింది.
మరోవైపు ఈ ఘటన అనంతరం సులబ్పూర్ను వీడిన బాధిత మహిళకు ప్రభుత్వం లాబ్పూర్లో ఒక ఇంటిని ఇచ్చింది. దీంతో అక్కడ ఉంటున్న ఆమె రోజు వారీ కూలిగా పని చేస్తున్నది. ఈ క్రమంలో ఒక వ్యక్తితో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే పెండ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ వ్యక్తికి అప్పటికే వివాహం జరిగినట్లు ఆ మహిళకు తెలిసింది. దీనిపై ఆ వ్యక్తిని ఫోన్లో నిలదీయగా అతడి భార్య ఆమె గతాన్ని గుర్తు చేసి అవమానించి తిట్టింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.