నోయిడా, అక్టోబర్ 11: ఉత్తరప్రదేశ్లో దళితులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. జేవార్ ప్రాంతంలో ఓ దళిత మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. గౌతమ బుద్ధ నగర్కు చెందిన మహిళ ఆదివారం ఉదయం చేనులో గడ్డి కోసేందుకు వెళ్లింది. అక్కడే పశువులను మేపుతున్న వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనం తరం మరో ముగ్గురు ఘాతు కానికి పాల్పడ్డారు. నలుగురు నిందితుల్లో ఒక్కరిని పోలీసులు అరెస్టు చేశా రు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. వారంతా బాధిత మహిళ గ్రామానికి చెందినవారే. ఆమెకు బాగా తెలిసినవారే కావడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది. లైంగిక దాడి ఘటనను బీఎస్పీ, కాంగ్రెస్ ఖండించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. బాధితురాలికి న్యాయం చేయాలని మాయావతి కోరారు. యూపీలోనే ముజఫర్నగర్లో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఆమె క్లాస్మేట్ సోదరుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యను వీడియో తీశాడు. ఆదివారం బాలిక తన క్లాస్మేట్ ఇం టికి వెళ్లింది. అక్కడ ఆమెపై ఘాతు కం జరిగింది. అనంతరం నింది తుడు పారిపోయాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.