భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని కోటి లింగాల క్రాస్రోడ్స్లో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఫొటోగ్రాఫర్స్ ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఐదు మంది ఫొటోగ్రాఫర్లు కలిసి.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ నిమిత్తం భద్రాచలం సమీపంలోని మోతెకు వెళ్తున్నారు. అయితే ఫొటోగ్రాఫర్లు ప్రయాణిస్తున్న కారును బొగ్గు లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
మృతులను ఓదెల కల్యాణ్(28), కొంపల్లి శివకోటి(31), బైరి రాము(32), బీ అరవింద్(21)గా గుర్తించారు. క్షతగాత్రుడిని ఏ క్రాంతిగా నిర్ధారించారు. శివకోటి, కల్యాణ్, క్రాంతి నర్సంపేట వాసులు కాగా, రాము, అరవింద్ కమలాపూర్కు చెందిన వారని పోలీసులు తెలిపారు.