లక్నో : ఉత్తరప్రదేశ్లోని సింగౌలితగా గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి బయట పార్కు చేసిన కారులో ఐదుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో కారు లాక్ అయిపోయింది. దీంతో ఊపిరాడక ఐదుగురిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన చిన్నారులంతా పదేండ్ల లోపు వయసున్న వారే అని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఊపిరాడకనే పిల్లలు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్నారుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.