హైదరాబాద్ : వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40 మంది విదేశీయులను రంగారెడ్డి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో వీరు పట్టుబడ్డారని డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. వీసా గడువు ముగిసినా వీరంతా అక్రమంగా దేశంలో ఉంటున్నారని దాడుల్లో వెల్లడవడంతో అరెస్ట్ చేశామని చెప్పారు. పట్టుబడిన వారిలో తెలుగు పాటలు పాడే నైజీరియన్ ఆర్టిస్ట్ చార్లెస్ ఉన్నాడు.
నిర్భందితులను ఆఫ్రికా, సోమాలియా, నైజీరియా, కాంగోలకు చెందిన వారిగా గుర్తించారు. నేరాలకు పాల్పడుతున్న వీరికి ఇంటిని అద్దెకు ఇచ్చిన వ్యక్తిపై కూడా చర్యలు చేపట్టనున్నారు. వీరు ఉంటున్న ఇండ్ల చిరునామాలు, ఇతర వివరాలను కూపీలాగుతున్నామని పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఓ అనుమానితుడిని అరెస్ట్ చేయడంతో పాటు మూడు వాహనాలను సీజ్ చేశారు. సన్ సిటీ, బండ్లగూడ, పీఎన్టీ కాలనీల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు.