చెన్నై: సహోద్యోగినిపై ఓ ఫ్లైట్ లెఫ్టినెంట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కోయంబత్తూర్లోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళా అధికారిణిని రెండు వారాల క్రితం ట్రెయినింగ్లో భాగంగా ఆటలు అడుతూ గాయపడ్డారు. ఆ గాయాలు తగ్గడం కోసం మెడిసిన్ వేసుకొని తన గదిలో నిద్రపోయారు.
అయితే, ఆమె నిద్రలేచి చూసుకుని తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకున్నారు. ఈ ఘటనపై వెంటనే తన పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, అధికారులు ఇప్పటివరకు కూడా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె స్థానిక గాంధీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఛత్తీస్గఢ్ రాష్టానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.