జెడ్డా : సౌదీ అరేబియాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. తాము ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో కుటుంబ యజమాని మహ్మద్ జబీర్ (44), భార్య షబ్న (36) ముగ్గురు పిల్లలు మరణించారు.
బాధిత కుటుంబం జుబైల్ నుంచి జిజన్కు ప్రయాణిస్తుండగా దక్షిణ సౌదీ అరేబియాలోని బిష ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జుబైల్లో తాను పనిచేస్తున్న ఉద్యోగం కోల్పోవడంతో జబీర్ జిజాన్లో కొత్త కంపెనీలో చేరేందుకు అక్కడికి వెళుతుండగా కుటుంబ సభ్యులందరూ మృత్యువాతన పడటంతో విషాదం నెలకొంది. మృతులందరూ కేరళకు చెందిన వారు.