కరీంనగర్: కరీంనగర్ నగర కేంద్రంలోని ఓ ఇంటిలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. దీంతో కరీంనగర్లో కలకలం రేగింది. దీంతో నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నగరంలోని లక్ష్మీ నగర్లోని ఓ ఇంటిలో ఐదుగురు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి.
ఆస్తులన్నీ పెద్ద అన్న పేరుపైనే ఉన్నాయి. దీంతో పెద్దన్న బంధువులు.. మిగతా వారిని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. పెద్ద అన్నపై మిగతా నలుగురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం ఉదయం మాట్లాడుకుందామంటూ చర్చలకు దిగారు.
సాయంత్రం ఇంటి వద్దే మాట్లాడుకుందామని చెప్పిన పెద్దన్న అస్గర్.. తన తమ్ముడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు తెలుస్తున్నది.
కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్గర్ హుస్సేన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కాల్పులు జరిగినట్లు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.