న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని అత్యంత జనసమ్మర్ధం కలిగిన కన్నాట్ప్లేస్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరిక్రమ రెస్టారెంట్లోని టాప్ ఫ్లోర్లో శనివారం మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు ఆరు అగ్నిమాపక యంత్రాలను రప్పించారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. కిచెన్ చిమ్నీలో అగ్నిప్రమాదం జరగ్గా ఫ్లోర్ అంతటికీ మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి ఇంకా కారణాలు వెల్లడి కాలేదని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.