ముంబై : సెంట్రల్ ముంబైలోని పరేల్ ప్రాంతంలో నౌరోస్జీ వాదియా ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి భవనంలోని ఫస్ట్ఫ్లోర్లో పీడియాట్రిక్ ఆపరేషన్ థియేటర్ సమీపంలో 7.50 గంటలకు మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు, ఆరు ట్యాంకర్లను ఘటనా స్ధలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఏ ఒక్కరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమీప వార్డుల్లోని రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అగ్నిప్రమాద ఘటనకు సంబందించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.