హైదరాబాద్ : నగరం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఓ పబ్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జూబ్లీ 800 పబ్లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలు చెలరేగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనం ఖాళీగా ఉందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. క్షతగాత్రుల్లో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.