కాచిగూడ : భార్య,భర్తలు గొడవపడి భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం తలబ్కట్టాలోని అమన్నగర్ ప్రాంతానికి చెందిన షేక్ సాధిక్ (27) ప్రైవేటు ఉద్యోగి. గత కొంత కాలంగా భార్య,భర్తలు తరుచుగా గొడవపడుతున్నారు. ఈ క్రమం లో ఈ నెల 27న భార్యతో గొడవపడిన షేక్ సాధిక్ భార్య, అత్తపై కత్తితో దాడిచేసి పారిపోయాడు.
పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని భయంతో మంగళవారం రాత్రి డబీర్పుర-మలక్పేట రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో శరీర భాగాలు చెల్లచెదురైనాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సాధిక్ మృత దేహన్ని స్వాధీనపర్చుకుని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.