Father Kills Toddler | భార్యాభర్తలన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ కొంతమంది ఈ గొడవలను తీవ్రస్థాయికి తీసుకెళ్తారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఇదే పని చేశాడు. 29 ఏళ్ల రవి రాయ్ అనే వ్యక్తి.. తన భార్యతో గొడవ పడ్డాడు. ఈ గొడవ చాలా పెద్దదయింది. దీంతో బాగా కోపం తెచ్చుకున్న అతను.. తమ మూడేళ్ల బిడ్డపై దాన్ని చూపించాడు.
నిద్రపోతున్న పసికందు కాలు పట్టుకొని లేపి, గోడకేసి బాదాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీ పరిసర ప్రాంతంలో జరిగింది. వంట చేయడానికి వెళ్తున్న భార్య.. బిడ్డను చూసుకోవాలని రవికి చెప్పడంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తనకు పని చెప్పినందుకు కోపం తెచ్చుకున్న అతను.. భార్యను ఎడాపెడా బాదేశాడు.
అనంతరం పసిగుడ్డు తలను గోడకేసి కొట్టాడు. దీంతో ఆ పసికందు చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రవి రాయ్ను అరెస్టు చేశారు.