హైదరాబాద్ : నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న వాహనాల దొంగని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని ఫలక్నుమా పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. నిందితుడి నుంచి పోలీసులు మూడు ఆటో రిక్షాలు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కలపత్తర్కు చెందిన మొహ్మద్ ఖురేషి(36)గా గుర్తించారు. రాత్రి సమయంలో వీధుల్లో తిరుగుతూ వీధుల్లో పార్క్ చేసిన ఆటో రిక్షాలను దొంగిలించేవాడని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.ఎస్.రవి కుమార్ తెలిపారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. విచారణలో భాగంగా ఇటువంటి కేసులోనే గతంలో ఖురేషిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్టు చేశారన్నారు.