శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం మరో సారి బంగారం పట్టుబడింది. నిందితులు విదేశాల నుంచి గ్రైండర్లు, కుక్కర్లు, షూలు, దుస్తులు, బ్యాగేజిలలో ..ఇలా బంగారం స్మగ్లింగ్కు అనేక ఎత్తులు వేస్తున్నారు.
తాజాగా షార్జా నుంచి ఓ ప్రయాణీకుడు చేతివాచ్లలో బంగారం దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం 233.4 గ్రాములు ఉంది. దాని విలువ రూ. 11.56 లక్షలు. బంగారం స్వాధీనం చేసుకొని అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.