న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోయింది. 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం కర్రలతో దారుణంగా చావ కొట్టారు. కొన ఊపిరితో ఉన్న బాధిత బాలుడ్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడని వైద్యులు తెలిపారు.
ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఈ సంఘటనపై ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమ్మాయిల సంగతి పక్కనపెట్టండి. ఢిల్లీలో కనీసం అబ్బాయిలకు కూడా భద్రత లేదు’ అని వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టడంతో చావుబతులకు మధ్య ఆసుపత్రిలో ఉన్నాడని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
మరోవైపు ఢిల్లీ పోలీసులు కూడా ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించారు. కేసు నమోదు చేయడంతోపాటు ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురు నిందితులు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
दिल्ली में लड़की तो क्या लड़के भी सुरक्षित नहीं हैं। एक 12 साल के लड़के के साथ 4 लोगों ने बुरी तरह से रेप किया और डंडों से पीटकर अधमरी हालत में छोड़कर चले गए। हमारी टीम ने मामले में FIR दर्ज करवाई। 1 आरोपी गिरफ़्तार, 3 अब भी फ़रार, दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। pic.twitter.com/tXrqK7xkwm
— Swati Maliwal (@SwatiJaiHind) September 25, 2022