న్యూఢిల్లీ : ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మను మోసం చేసిన కేసులో ఆర్ధిక నేరాల విభాగం (ఈడబ్ల్యూఎస్) ఢిల్లీకి చెందిన నిందితుడిని అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన 750 గజాల స్ధలం విక్రయానికి సంబంధించి ఎంపీ అనురాగ్ శర్మను మాజీ జ్యుడిషియల్ అధికారిగా చెప్పుకుంటున్న వినోద్కుమార్ శర్మ ఆయన అనుచరులు విక్రయించారు.
ఈ స్ధలాన్ని 2017 ఫిబ్రవరిలో రూ 5.6 కోట్లకు కొనుగోలు చేసేందుకు అనురాగ్ శర్మ అంగీకరించారు. అయితే ఈ ఆస్తిని అప్పటికే వినోద్కుమార్ శర్మ బ్యాంకుల వద్ద తాకట్టుపెట్టి రూ 20.2 కోట్ల రుణం పొందిన విషయం దాచిపెట్టారు. మరోవైపు ఆస్తి అమ్మకాన్ని తెలిచపరచకుండా డీఎంఆర్సీ లీజు సమయాన్ని కూడా తమ పేరున నిందితుడు పొడిగించుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఈడబ్ల్యూఎస్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని పంచ్శీల్ ఎన్క్లేవ్కు చెందిన వినోద్కుమార్ శర్మ తాను మాజీ జ్యుడిషియల్ అధికారినని చెబుతుండగా అధికారులు నిందితుడి వివరాలను ఇంకా నిర్ధారింలేదు.