పహాడీషరీఫ్ : అనారోగ్యంతో ఓ వృద్ధుడు పి.పి రెడ్డి వృద్ధాశ్రమం బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ వివరాల ప్రకారం నర్సింహ్మ రెడ్డి (75) అనే వృద్ధుడు రిటైర్డ్ ఉద్యోగి.
పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ గ్రామంలోని పన్నాల పర్వాతాలు రెడ్డి వృద్ధాశ్రమంలో గత రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 21న తన కుమారుడు ఉంటున్న జూబ్లిహిల్స్కు వెళ్లి 22న తిరిగి ఆశ్రమానికి వచ్చాడు.
తన చావుకు ఎవరు కారణం కాదని అనారోగ్యకారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసిపెట్టి గురువారం ఉదయం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుడి కుమారుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.