డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధమ్సింగ్ నగర్ జిల్లా కిచ్చా సమీపంలో భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో 37 మంది గాయపడ్డట్లు సమాచారం. ప్రమాదం వివరాలు తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో క్షతగాత్రులు, మృతుల బంధువుల రోధనలు మిన్నంటాయి. పోలీసులు, అధికార యంత్రాంగం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
శక్తి ఫారం ప్రాంతంలోని బాస్గర్ గ్రామానికి చెందిన దాదాపు 45 నుంచి 50 మంది భక్తులు సరిహద్దులో ఉన్న ఉత్తరప్రదేశ్ప్రాం తంలోని ఉత్తమ్నగర్లో ఉన్న గురుద్వారాకు పూజలు చేయడానికి ట్రాక్టర్లో బయలుదేరారు. ఉత్తమ్నగర్ గురుద్వారాలో ప్రతి ఆదివారం, గురుగ్రంథ సాహిబ్ పారాయణం, లంగర్ కార్యక్రమం జరుగుతుండగా.. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. సిర్సా అవుట్పోస్ట్ బరేలీ జిల్లాలోని బహేరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అవుట్ పోస్ట్ సమీపంలో ట్రాక్టర్ రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంత్రి మరణించారని పేర్కొన్నారు.