ముంబై: రూ.42.86 కోట్ల విలువైన ఐఫోన్-13 స్మార్ట్ఫోన్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన పార్సిల్స్ను తనిఖీ చేయగా వీటి స్మగ్లింగ్ విషయం బయటపడింది. నవంబర్ 26న సింగపూర్ నుంచి ముంబై విమానాశ్రయానికి రెండు కంజైన్మెంట్లు వచ్చాయి. వీటిని తనిఖీ చేయగా 3,646 ఐఫోన్-13 స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు అందులో ఉన్నాయి. దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న వీటిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.42.86 కోట్లు ఉంటుందని తెలిపారు. ఎవరి కోసం పంపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.