శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో స్మగ్లింగ్ బంగారం ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం…ఓ వ్యక్తి హైదరాబాద్కు రియాద్ నుంచి కువైట్ మీదుగా జజీర ఎయిర్లైన్స్ జె9 1403 విమానం ద్వార వచ్చాడు.
సదరు ప్రయాణీకుడిని అనుమానంతో అదుపులోకి తీసుకుని పరిశీలించగా చాక్లెట్ బాక్స్లో బంగారం బిస్కట్లను గుర్తుపట్టకుండా దాచి ఉంచినట్టు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు చాక్లెట్ బాక్స్ను తనిఖీ చేసి బంగారం గుర్తించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం 763.660 గ్రాముల బరువు ఉంది. దాని విలువ రూ . 34.24 లక్షలు. నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.