కాచిగూడ : కారు డ్రైవర్ అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కె.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం పురణాపూల్లోని మురళీనగర్ ప్రాంతానికి చెందిన అంబదాస్ గౌడ్ (33) కారుడ్రైవర్. అంబదాస్గౌడ్కు గత కొంత కాలంగా మతిస్థిమితం సరిగాలేదు.
కాచిగూడ డివిజన్లోని కుద్భిగూడలో నివాసముంటున్న అక్క రేఖ మెరుగైన చికిత్స కోసం అంబదాస్ను కాచిగూడలోని ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. సోమవారం ఉదయం అంబదాస్ ఎవరికీ చెప్పకుండా దవాఖాన నుంచి వెళ్లి ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు బంధువుల, ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో అక్క రేఖ మంగళవారం రాత్రి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అంబదాస్ గౌడ్ వెళ్లే సమయంలో ఆకుపచ్చ రంగు షర్ట్, నీలి రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. రేఖ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.