Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రోహిణి ప్రాంతంలో నిన్న సాయంత్రం ఓ యువకుడు తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమెపై 21 సార్లు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ప్రియురాలి తలపై ఇటుకతో అనేకసార్లు మోదాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలిని సాక్షి(16)గా, నిందితుడిని సాహిల్గా పోలీసులు గుర్తించారు. సాక్షిని హత్య చేసే కంటే ముందు ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు నిర్ధారణ అయింది. అయితే సాక్షిని హత్య చేస్తుంటే అక్కడున్న వారు సాహిల్ను ఆపేందుకు సాహసం చేయలేదు. సాక్షి తన ఫ్రెండ్ కుమారుడి బర్త్డే వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా, ఆమెపై సాహిల్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సాహిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.