న్యూఢిల్లీ: కుక్క మొరగడంతో ఒక వ్యక్తి చిరాకుపడ్డాడు. ఆ కుక్కతోపాటు దాని యజమానులైన పొరుగువారిపై ఇనుప రాడ్తో దాడి చేశాడు. దీంతో కుక్కతో పాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ్ విహార్ ప్రాంతానికి చెందిన ధరమ్వీర్ దహియా ఆదివారం ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే పొరుగింటి కుక్క అతడ్ని చూసి మొరిగింది. చిరాకుపడిన ఆ వ్యక్తి వెంటనే ఇనుప రాడ్ను పట్టుకుని వచ్చాడు. ఆ కుక్కపై దాడి చేయబోగా యజమానులతోపాటు పొరుగున ఉన్న వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోని ధరమ్వీర్ దహియా తన చేతిలో ఉన్న రాడ్తో కుక్క తలపై కొట్టాడు. అలాగే పక్కనే ఉన్న 53 ఏళ్ల పొరుగు వ్యక్తిని కూడా ఆ రాడ్తో కొట్టాడు. దీంతో కుక్క యజమాని రక్షిత్, ఆ కుటుంబానికి చెందిన మహిళ ఆ వ్యక్తిని పట్టుకుని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారి మధ్య పెనుగులాట జరిగింది.
మరోవైపు ధరమ్వీర్ ఇనుప రాడ్తో కొట్టడంతో కుప్పకూలిన కుక్క కొంత సేపటి తర్వాత లేచింది. యజమానితో పెనుగులాడుతున్న ఆ వ్యక్తిని కరిచింది. ఈ దాడిలో ఆ కుక్కతోపాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, గాయపడిన కుక్కను దాని యజయాని పశు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అయితే అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Day light violence in Delhi paschim vihar A4 block.
This man attacked multiple people including a woman and a dog @narendramodi @DelhiPolice @CPDelhi @PMOIndia @ArvindKejriwal @AamAadmiParty @BJP4India @peta #AnimalAbuse #Attack #attempttomurder @ndtvvideos @ndtvindia pic.twitter.com/tsusXkZCDA— Mohit Mohlia (@MohitMohlia) July 3, 2022