భోపాల్: ఆరేండ్ల మూగ, చెవిటి బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లో షాహడోల్లో ఈ దారుణం జరిగింది. శనివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న మూగ, చెవిటి బాలికను పొరుగున ఉండే వ్యక్తి మభ్యపెట్టి నిర్మాణుష్య ప్రాంతంలోని ఒక గుడిసెకు తీసుకున్నారు. అక్కడ మరో ఐదుగురు ఉన్నారు. ఆరుగురు ఒకరి తర్వాత ఒకరు ఆ బాలికపై సామూహిక లైంగిక దాడి చేశారు. ప్రతిఘటించిన ఆమెను కొట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే బాధిత బాలిక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.
మరోవైపు ఈ ఘటనను ఫొటోలు తీసిన నిందితులు తమకు తెలిసిన వారికి వాటిని షేర్ చేశారు. ఆ ఫొటోలు మరి కొందరికి సర్క్యులేట్ అయ్యాయి. దీంతో ఈ విషయం బాధిత బాలిక తండ్రికి తెలిసింది. దీని గురించి ఆ బాలికను అడుగగా ఆమె కన్నీటి పర్యంతమైంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
సామాజిక న్యాయం డిపార్ట్మెంట్కు చెందిన నిఫుణుల కమిటీకి బాధిత బాలిక సైగలు ద్వారా జరిగింది చెప్పగా స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఫొటోల ఆధారంగా నిందితులను ఆమె గుర్తించగా వారిని అరెస్ట్ చేశారు. ఆరుగురు నిందితుల్లో నలుగురు మైనర్లని పోలీసులు తెలిపారు.