లక్నో : సీనియర్కు నమస్తే చెప్పలేదని జూనియర్ విద్యార్థిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. పదో తరగతికి చెందిన ఓ దళిత విద్యార్థి.. ట్యూషన్కు వెళ్తుండగా అతని సీనియర్లు తారసపడ్డారు. అయితే సీనియర్లకు జూనియర్ నమస్తే చెప్పలేదు. దీంతో జూనియర్ను సీనియర్లు తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆ తర్వాత కాలిపై తుపాకీతో కాల్పులు జరిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధిత విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితుల నుంచి తుపాకీతో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే విద్యార్థిపై కాల్పులు జరిపిన నిందితుడు గతేడాది కూడా ఆత్మహత్యాయత్నం కేసులో జైలు పాలయ్యాడు. ఇటీవలే బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యాడు.