లూధియానా : భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు భార్య, కుమార్తెపై దాడి చేసిన వ్యక్తి ఉదంతం పంజాబ్లోని లూధియానాలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెట్రో రోడ్లో క్రాకరీ షాపును నిర్వహిస్తున్న నిందితుడు పరంజిత్ సింగ్ తన షాపులో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు.
వీరి వ్యవహారాన్ని భార్య ప్రశ్నించడంతో ఆమెతో ఘర్షణ పడ్డాడు. కూతురు సైతం తండ్రిని ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు ఇద్దరిపై దాడికి తెగబడ్డాడు. తల్లీకూతుళ్ల అరుపులతో అక్కడికి చేరుకున్న స్ధానికులు వారిని కాపాడారు. భార్య ఫిర్యాదుపై పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు ముమ్మరం చేశారు.