ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సూర్యలక్ష్మి కాటన్మిల్లులో పనిచేస్తున్న ఓడిషా రాష్ట్రానికి చెందిన మనోరంజన్ స్వైన్ (26) అనే కార్మికుడు కుటుంబ కలహాలతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓడిషా రాష్ట్రంలోని బద్రిద్ జిల్లాకు చెందిన మనోరంజన్ భార్య గులబారి స్వైన్తో కలిసి కొంతకాలంగా కాటన్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై భార్యతో నిత్యం గొడవలు పడేవాడు. రోజువారి విధంగా గురువారం పని ముగించుకొని భార్యతో గోడవపడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనోరంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇది గమనించిన భార్య గులబారి స్వైన్ చుట్టుపక్కల వారి సాయంతో ఆత్మహత్యకు పాల్పడిన భర్తను చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. భార్య గులబారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి దవాఖానకు తరలించినట్లు ఎస్సై ధర్మేశ్ తెలిపారు.