కొత్తూరు : రైలు పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జాతయ రహదారి పక్కన ఉన్న కర్నూల్ సిలిండర్ పరిశ్రమ సమీపంలో ఓ వ్యక్తి (50) మృతదేహం కన్పించింది. అతని ఎత్తు 5.2 అడుగులు, చామనచాయ రంగు కలిగి ఉన్నాడు. అతను ఎలాంటి దుస్తులు ధరించి లేడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు కొత్తూరు పోలీస్ స్టేసన్ను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.